*ఆచార్య సద్భోదన*
అణకువ, ప్రేమ, సహనం ఇవి అన్ని వేళలా ఉండేలా చూసుకోవాలి.
"నిందాస్తుతుల యందు సమముగా వ్యవహరించువాడు, ఉన్న దానితో సంతృప్తిని పొందువాడు, గృహాదుల (భౌతికత) యందు ఆసక్తి లేని వాడును, నిశ్చయ బుద్ధిని కలిగిన వాడు నాకు ఇష్టుడు. శ్రద్ధావంతులై నాచే చెప్పబడిన మోక్ష సాధనను ఎవరైతే భక్తితో అనుష్ఠిస్తారో అట్టి భక్తుడు నాకు అత్యంత ప్రియమైనవాడు."
-భగవద్గీత.
మన హృదయంలో వినమ్రత నిండి ఉంటే ఇంకొకరిని తూలనాడము. ప్రేమను సదా వ్యక్త పరుస్తూ ఉన్నప్పుడే సహనశక్తి పెరుగుతుంది. ఈ మూడూ సమతుల్యంగా ఉన్నప్పుడే సామరస్యం చేకూరుతుంది. వీటిని అభివృద్ధి చేసుకొనేందుకు నిరంతర కృషిని అవిరామంగా చేయాలి. మనస్సుని ఈ విధంగా చక్కబెట్టుకుంటే, సహజ జ్ఞానముతో చక్కటి లయ దానంతటదే పలుకుతూ మనలను కష్టాలను అధిగమించే స్థితికి, ఆటంకాలను ఎదుర్కొనే స్థితికి తీసుకువెళుతుంది.
*శుభంభూయాత్*